గంపలగూడెంలో పేదలకు అన్నసమారాధన
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం గంపలగూడెంలో పేదలు, అనాధలు, వృద్ధులు, కార్మికులకు మంగళవారం అన్నసమారాధన నిర్వహించారు.
గంపలగూడెంలోని కుందా కోటేశ్వరరావు నివాసం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పేదలు పాల్గొని భోజనం చేశారు. తన భార్య సావిత్రి జ్ఞాపకార్థం దాత కుందా కోటేశ్వరరావు గత రెండు నెలలుగా ప్రతి మంగళవారం అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కుందా కోటేశ్వరరావు ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ సామాజిక సేవలో ముందుంటూ ప్రజల అభిమానాన్ని, మన్ననలను పొందుతున్నారు. పేదలు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.