జనార్దనవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం జనార్దనవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చాట్రాయి మండల తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాదాసు చిన్నపుల్లయ్య, వంగల సుబ్బారావు, వంగల రమేష్, బలువురి రత్తయ్య, కొత్తపల్లి ప్రభాకర్తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.