BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 31 August 2026, 09:15 am
Posted by : JULI SRINIVASULU

వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు..

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Juli Srinivasulu Kodada Town Reporter
31 Aug, 2026 - 09:15 AM
10 వీక్షణలు

వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. ప్రజల్లో ఆనందం

మార్కాపురం: కరువు, మెట్ట ప్రాంతంగా పేరున్న మార్కాపురం ప్రాంతానికి శ్రీ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు చేరుతుండటంతో స్థానిక ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందిన ప్రజలకు కృష్ణా జలాల రాక ఊరటనిచ్చింది.

వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయా? అనే సందేహాలు నెలకొన్న తరుణంలో కృష్ణా జలాలు మార్కాపురం జిల్లా ప్రాంతంలోకి రావడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రాజెక్టు త్వరలో పూర్తవుతుందని ఆశించిన వారికి ఇది ఆనందాన్ని కలిగించే పరిణామంగా మారింది.

ఇటీవల ప్రాజెక్టు ట్రయల్ రన్‌లో భాగంగా నీరు పెద్దారవీడు మండలం కలనూతల గ్రామం వైపు చేరడంతో పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసే సమయంలో ఆయా గ్రామాలపై ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.


 వెలుగొండ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మార్కాపురం ప్రాంత ప్రజల చిరకాల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.