కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి
కడప, ఇన్ టుడే న్యూస్: కడప నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాలకొండల రింగ్ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.
ప్రాథమిక సమాచారం మేరకు మృతులు ఇద్దరూ ఇంజనీరింగ్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
కారు ఢీకొనడంతో బైక్పై ఉన్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రిమ్స్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.
మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్ వివరాలను సేకరిస్తున్నారు.
ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.