నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
హైదరాబాద్, ఆగస్టు 29 | ఎన్ టుడే న్యూస్
దివంగత ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ 8వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్లో ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఎస్టేట్లోని ఆహ్వానం హోటల్లో హరికృష్ణ మిత్రులు, అభిమానుల ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ మిత్రులు, అభిమానులు ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఘనంగా అన్నదాన కార్యక్రమం
హరికృష్ణ 8వ వర్ధంతి సందర్భంగా ఆయన మిత్రుడు శనక్కాయల కృష్ణారావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆహ్వానం హోటల్ బృందం సభ్యులు, హరికృష్ణ అభిమానులు, మిత్రులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరికృష్ణకు ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన జ్ఞాపకాలను స్మరించుకున్నారు.