BREAKING
ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్
www.ntodaynews.com

ఏటికొప్పాకకు పర్యాటక హంగులు

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
ADARI RAMA PRASAD MUNAGAPAKA MANDAL
29 Aug, 2026 - 05:46 PM
16 వీక్షణలు

ఏటికొప్పాకకు పర్యాటక హంగులు

రూ.3 కోట్లతో అభివృద్ధి పనులకు భూమిపూజ

అనకాపల్లి జిల్లా | ఎలమంచిలి | Ntoday News

ఎలమంచిలి నియోజకవర్గంలోని ఏటికొప్పాక గ్రామానికి పర్యాటక హంగులు అద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శనివారం భూమిపూజ నిర్వహించారు.

ఏటికొప్పాక హస్తకళ, ఇతివృత్తంతో పాటు యువజన అభివృద్ధికి అవసరమైన వసతులను అభివృద్ధి చేసేలా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. ఏటికొప్పాకకు ఉన్న ప్రత్యేక కళా, సాంస్కృతిక గుర్తింపును మరింతగా ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా మౌలిక వసతులు కల్పించనున్నారు.

ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొని అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.

ఏటికొప్పాక హస్తకళకు మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు స్థానికంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందితే యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.