BREAKING
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా
www.ntodaynews.com

మునుకుళ్ళలో ఘనంగా భాషా దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 05:49 PM
14 వీక్షణలు

గిడుగు రామమూర్తి సేవలు తెలుగు భాషకు చిరస్మరణీయం

(ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం మునుకుళ్ళ)

వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి తెలుగు భాష అభివృద్ధికి చేసిన సేవలు అజరామరమని అరసం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి రేపాక రఘునందన్ పేర్కొన్నారు. గ్రాంధిక భాష నుంచి వ్యావహారిక భాష వైపు తెలుగును మళ్లించి సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేసిన ఘనత గిడుగు రామమూర్తికే దక్కుతుందని అన్నారు.

భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మునుకుళ్ళ ఉన్నత పాఠశాలలో తిరువూరు రచయితల సంఘం, అరసం ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు తెలుగు వ్యాసరచన, పద్య పఠన పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

ముందుగా గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాష గొప్పతనం, భాష పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జె. మురళీకృష్ణ, ఉపాధ్యాయినులు నాగరత్న కుమారి, డి. లక్ష్మీ, టి. భరతకుమారి, వేణీ కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.