BREAKING
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా
www.ntodaynews.com

గోబర్ గ్యాస్ గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
29 Aug, 2026 - 06:23 PM
8 వీక్షణలు

గోబర్ గ్యాస్ గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి

నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గోబర్ గ్యాస్ కోసం ఏర్పాటు చేసిన గుంతలో ప్రమాదవశాత్తు పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన అజయ్ పండిట్ తన కుటుంబంతో కలిసి రెండు రోజుల క్రితం రాఖీ పండుగ సందర్భంగా ఏపూర్ గ్రామంలోని డీఈసీ కంపెనీలో పనిచేస్తున్న తన మామయ్య ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో అజయ్ పండిట్ కుమారుడు ఆర్యన్ కుమార్ (2) క్వార్టర్స్ పక్కన ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం వరకు బాలుడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కంపెనీలోని సీసీ కెమెరాలను పరిశీలించగా బాలుడు గోబర్ గ్యాస్ కోసం ఏర్పాటు చేసిన గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయినట్లు గుర్తించారు. గుంతలో బాలుడు ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మృతుడి తండ్రి అజయ్ పండిట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బి. వెంకట్ రెడ్డి తెలిపారు.