BREAKING
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా
www.ntodaynews.com

ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
29 Aug, 2026 - 05:58 PM
11 వీక్షణలు

సైదాబాద్, ఆగస్టు 29 | ఎన్ టుడే న్యూస్

అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను పురస్కరించుకుని సైదాబాద్ పరిధిలోని సరళాదేవి నగర్‌లో గోడపత్రికను ఆవిష్కరించారు. ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి షేక్ మహమూద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు యువజన, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఏఐవైఎఫ్ ఏర్పడిన నాటి నుంచి యువత సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు. ముఖ్యంగా 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే డిమాండ్‌తో అప్పట్లో అనేక ఉద్యమాలు నిర్వహించి, ఓటు హక్కు సాధనలో యువజన సమాఖ్య కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.

విద్యార్థులు, యువత, మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఏఐవైఎఫ్ అనేక పోరాటాలు నిర్వహించిందని నాయకులు గుర్తుచేశారు. భవిష్యత్తులోనూ యువత సమస్యలపై ముందుండి పోరాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో షేక్ మహమూద్, ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి, సీపీఐ హైదరాబాద్ కౌన్సిల్ సభ్యులు రూప్‌సింగ్ నాయక్, రవి, రాజు, గణేష్, చిన్న, నాగరాజు, బసవరాజు, నాయక్, ఆంజనేయులు, శ్రీకాంత్, మహిళా నాయకురాలు కమిలివాయి తదితరులు పాల్గొన్నారు.