BREAKING
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా
www.ntodaynews.com

గంపలగూడెంలో మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుకు అవగాహన కల్పించాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 05:49 PM
15 వీక్షణలు

పీవోపీ విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు : కౌన్సిల్‌ ఫర్‌ సిటిజన్‌ రైట్స్‌ విజ్ఞప్తి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం:

వినాయక చవితి పండుగ సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసే వినాయక మండపాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసేలా నిర్వాహకులను ప్రోత్సహించాలని కౌన్సిల్‌ ఫర్‌ సిటిజన్‌ రైట్స్‌ జిల్లా సమన్వయకర్త పద్మనాభుని మణిదీప్ కోరారు.

ఈ మేరకు శనివారం గంపలగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి టి.సరస్వతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మణిదీప్ మాట్లాడుతూ పీవోపీ విగ్రహాల నిమజ్జనం వల్ల నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. మట్టి విగ్రహాలు పర్యావరణానికి అనుకూలంగా ఉండటంతో పాటు సహజంగా నీటిలో కలిసిపోతాయని తెలిపారు.

వినాయక చవితి సందర్భంగా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులకు మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పించాలని ఎంపీడీవోను కోరారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

భక్తిశ్రద్ధలతో పండుగను నిర్వహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని మణిదీప్ విజ్ఞప్తి చేశారు.