BREAKING
బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది
www.ntodaynews.com

పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
Shaik Chand Basha Pulivendula Constituency Reporter
28 Aug, 2026 - 09:35 PM
1 వీక్షణలు

పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

పులివెందుల | Ntoday News

పులివెందుల పరిధిలో నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఆగస్టు 27 సాయంత్రం పులివెందుల రింగ్‌రోడ్డు సమీపంలోని కే.వెలమవారిపల్లి క్రాస్ వద్ద ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరిగుట్టకు చెందిన సటుపాటి శివకుమార్ (38) నాటుసారా విక్రయిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అతని వద్ద ఉన్న 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై క్రైమ్ నంబర్ 64/2026 కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

‘నవోదయం’ నాటుసారా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలు చట్టరీత్యా నేరమని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ దాడుల్లో కడప ESTF ఎక్సైజ్ సీఐ జి. విశ్వనాథ్ రెడ్డి, పులివెందుల ఎక్సైజ్ సీఐ ఎల్. చెన్నారెడ్డితో పాటు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

పులివెందుల పరిధిలో నాటుసారా తయారీ, విక్రయాలు లేదా రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే ఎక్సైజ్ అధికారులకు తెలియజేయాలని అధికారులు ప్రజలను కోరారు.