BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 28 August 2026, 09:35 pm
Posted by : SHAIK CHAND BASHA

పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
28 Aug, 2026 - 09:35 PM
34 వీక్షణలు

పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

పులివెందుల | Ntoday News

పులివెందుల పరిధిలో నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఆగస్టు 27 సాయంత్రం పులివెందుల రింగ్‌రోడ్డు సమీపంలోని కే.వెలమవారిపల్లి క్రాస్ వద్ద ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరిగుట్టకు చెందిన సటుపాటి శివకుమార్ (38) నాటుసారా విక్రయిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అతని వద్ద ఉన్న 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై క్రైమ్ నంబర్ 64/2026 కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

‘నవోదయం’ నాటుసారా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలు చట్టరీత్యా నేరమని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ దాడుల్లో కడప ESTF ఎక్సైజ్ సీఐ జి. విశ్వనాథ్ రెడ్డి, పులివెందుల ఎక్సైజ్ సీఐ ఎల్. చెన్నారెడ్డితో పాటు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

పులివెందుల పరిధిలో నాటుసారా తయారీ, విక్రయాలు లేదా రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే ఎక్సైజ్ అధికారులకు తెలియజేయాలని అధికారులు ప్రజలను కోరారు.