BREAKING
బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది
www.ntodaynews.com

వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
Shaik Chand Basha Pulivendula Constituency Reporter
28 Aug, 2026 - 09:33 PM
1 వీక్షణలు

వెలమవారిపల్లె సచివాలయంలో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

పులివెందుల | Ntoday News

పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని వెలమవారిపల్లె సచివాలయాన్ని మున్సిపల్ కమిషనర్ తనూజ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు.

ఈ సందర్భంగా సిబ్బంది హాజరు పుస్తకంతో పాటు సచివాలయంలోని వివిధ రికార్డులను కమిషనర్ తనిఖీ చేశారు. ప్రజల నుంచి అందుతున్న అర్జీలు, ఫిర్యాదుల వివరాలను పరిశీలించి, సచివాలయ పరిధిలో పరిష్కరించగల సమస్యలను అక్కడికక్కడే గుర్తించి సత్వరమే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సచివాలయానికి వచ్చినప్పుడు వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓపికగా తెలుసుకుని సంబంధిత శాఖల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని కమిషనర్ సూచించారు.

మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా అందించాలని ఆమె పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.