మధిరలో యోగా నిత్య సాధన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
మధిరలో యోగా నిత్య సాధన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
మధిర : తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర పట్టణంలోని శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో యోగా శక్తి సాధన కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో యోగా గురూజీ నాళ్ళ శ్రీనివాసరావు మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ విశిష్టత, భారతీయ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని యోగా సభ్యులకు వివరించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ ప్రతి ఒక్కరిలో ప్రేమాభిమానాలను పెంపొందిస్తుందని తెలిపారు.
అనంతరం యోగా సభ్యులు ఉత్సాహంగా రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొని ఒకరికొకరు రాఖీలు కట్టుకుని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యోగా సభ్యులు లింగంపల్లి అప్పారావు, శ్యామలరావు, దుర్గాప్రసాద్, విశ్వేశ్వరరావు, కిషోర్, స్వర్గం శ్రీనివాసరావు, సత్యనారాయణ, నంద, సుధాకర్, శ్రీనివాసరావు, సునీత, రమ్య, రాణి, శ్రీదేవి, లక్ష్మి, శ్రావ్య, అనూష, భారతి, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.