శివాలయంలో సామూహిక గాయత్రీ ధారణ మహోత్సవం
శివాలయంలో సామూహిక గాయత్రీ ధారణ మహోత్సవం
రాఖీ పౌర్ణమి సందర్భంగా చిట్యాల పట్టణంలోని శివాలయంలో భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక గాయత్రీ ధారణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ శాస్త్రోక్తంగా గాయత్రీ పూజ నిర్వహించి, యజ్ఞోపవీతం విశిష్టతను వివరించారు. పద్మశాలి కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ గోత్రనామాలతో అర్చనలు చేయించుకుని యజ్ఞోపవీతాలను ధరించారు. అనంతరం రాఖీలు కట్టుకుని, మిఠాయిలు మరియు ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు జెల్ల మనోహర్, ప్రధాన కార్యదర్శి గంజి వెంకటేశం, పున్న పాండుజీ, జెల్ల సత్తయ్య, గంజి సుధాకర్, చేపూరి శ్రీనివాస్, వలకీర్తి రమేష్, రాపోలు లక్ష్మయ్య, గంజి కృష్ణయ్య, చెరుపల్లి శ్రీనివాస్, గంజి గోవర్ధన్, కస్తూరి కృష్ణమోహన్, తడక మురళి, గంజి కనకయ్య, డా. కోట దయాకర్, మిర్యాల గోపాల్, వడ్డేపల్లి రాములు, గంజి అంజయ్య, సూరపల్లి సత్యనారాయణ, కైరం కొండ భాస్కర్, మిర్యాల వెంకటేశం, గుర్రం బిక్షపతి, మిర్యాల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.