BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

వినగడప–తోటమూల మధ్య కట్టలేరు వాగుపై తప్పని వరద కష్టాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 06:06 PM
2 వీక్షణలు

వినగడప–తోటమూల మధ్య కట్టలేరు వాగుపై తప్పని వరద కష్టాలు

స్వల్ప వర్షానికే తాత్కాలిక రహదారిపైకి వరద నీరు.. ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న శాశ్వత వంతెన

ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం:

గంపలగూడెం మండలం వినగడప–తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగు వద్ద వరద కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. నిన్న కురిసిన స్వల్ప వర్షానికే వాగులో నీటి ప్రవాహం పెరిగి తాత్కాలిక రహదారిపై అర అడుగు మేర వరద నీరు చేరింది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఎనిమిదేళ్ల క్రితం భారీ వర్షాలకు కట్టలేరు వాగుపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రతి వర్షాకాలంలో ఈ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న రహదారి వరదలకు కొట్టుకుపోవడం, మళ్లీ పునర్నిర్మాణం చేయడం ఏటా పునరావృతమవుతోంది.

ఈ మార్గం ద్వారా ప్రయాణించే సమీపంలోని సుమారు 20 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన ప్రయాణానికి ప్రత్యామ్నాయ మార్గంలో సుమారు 30 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రతిసారి తాత్కాలిక రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది పెద్దగా వర్షాలు లేక ఊపిరి పీల్చుకున్న గ్రామాల ప్రజలకు, తాజాగా కురిసిన కొద్దిపాటి వర్షానికే వాగులో నీటి ప్రవాహం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

కట్టలేరు వాగుపై శాశ్వత వంతెన నిర్మించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న వంతెన నిర్మాణం ఎప్పటికి సాకారం అవుతుందోనని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.