www.ntodaynews.com
డివైడర్ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు
ఆంధ్రప్రదేశ్
/
వైఎస్ఆర్ కడప
డివైడర్ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు
పులివెందుల | NTODAY News
పులివెందుల పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో సత్రం బడి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో గాయాలయ్యాయి.
ప్రమాదంలో గాయపడిన వ్యక్తి బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
గాయపడిన వ్యక్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై సమాచారం అందాల్సి ఉంది.