BREAKING
పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.
www.ntodaynews.com

గంపలగూడెం ఊటుకూరులో పోలీసుల పల్లె నిద్ర....

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 09:25 PM
17 వీక్షణలు

గంపలగూడెం ఊటుకూరులో పోలీసుల ‘పల్లె నిద్ర’.. ఎన్నికల వేళ భద్రతపై ప్రత్యేక దృష్టి

ఊటుకూరు:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించే లక్ష్యంతో గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

విజయవాడ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, రూరల్ డీసీపీ మార్గదర్శకత్వంలో, మైలవరం ఏసీపీ పర్యవేక్షణలో తిరువూరు సీఐ కే. గిరిబాబు, గంపలగూడెం ఎస్సై జీ. అనిల్‌తో పాటు పోలీసు సిబ్బంది గురువారం రాత్రి గ్రామంలో బస చేశారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలోని సున్నిత ప్రాంతాలను పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామస్తులతో సమావేశమై స్థానిక సమస్యలు, భద్రతా అంశాలను అడిగి తెలుసుకున్నారు.

ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా ‘ఖాకీ స్టూడియో’ వీడియో ప్రదర్శన ద్వారా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా యువత గంజాయి, బెట్టింగులు, ర్యాష్ డ్రైవింగ్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

ప్రజల రక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని అధికారులు భరోసా ఇచ్చారు. పోలీసులే స్వయంగా గ్రామంలో రాత్రి బస చేసి సమస్యలు తెలుసుకోవడం పట్ల ఊటుకూరు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.