నెల్లూరు జిల్లాలో ఏసీబీ దాడులు....
నెల్లూరు జిల్లాలో ఏసీబీ దాడులు.. రూ.3 లక్షల లంచం తీసుకుంటూ నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్ పట్టుబాటు
సోమశిల నీటిపారుదల శాఖలో అవినీతి బాగోతం.. ఏసీబీ వలలో అధికారులు
నెల్లూరు జిల్లా సోమశిల నీటిపారుదల శాఖలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రూ.3 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి కొంతమంది అధికారులతో పాటు ప్రైవేట్ కాంట్రాక్టర్ను పట్టుకున్నారు.
అధికారులు నేరుగా లంచం తీసుకోకుండా పక్కనే ఉన్న కాంట్రాక్టర్ సోంపల్లి మాధవ్ ద్వారా నగదు స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రూ.3 లక్షల లంచం నగదు తీసుకుంటున్న సమయంలో కాంట్రాక్టర్ ఏసీబీ వలలో చిక్కాడు.
ఈ ఘటనలో కాంట్రాక్టర్ సోంపల్లి మాధవ్తో పాటు సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అవినీతి వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.