నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
అంకాలమ్మ గూడూరు కొత్తపాలెంలో ఘనంగా పూజా కార్యక్రమాలు
సింహాద్రిపురం:
అంకాలమ్మ గూడూరు కొత్తపాలెంలో ఘనంగా పూజా కార్యక్రమాలు అంకాలమ్మ గూడూరు కొత్తపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీరాముడి దేవాలయ నిర్మాణానికి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గురువారం భూమిపూజ చేసి,శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు.అనంతరం బీటెక్ రవి మాట్లాడుతూ గ్రామాల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందాలని,శ్రీరాముడి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి కావాలని కోరుతూ,గ్రామ ప్రజల ఆధ్యాత్మిక,అభివృద్ధి కార్యక్రమాలకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బాబు రెడ్డి, సాంబశివరెడ్డి,సతీష్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి,ధ్రువకుమార్ రెడ్డితో పాటు కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు,గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.