BREAKING
పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.
www.ntodaynews.com

బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి

తెలంగాణ
/ సంగారెడ్డి / అమీన్‌పూర్
Reporter
Goutham Rudrarapu పటాన్ చెరు నియోజకవర్గ ప్రతినిధి
27 Aug, 2026 - 08:09 PM
14 వీక్షణలు

బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి - స్థానికుల్లో హర్షం

బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు ఉన్న ప్రధాన రహదారిపై సుదీర్ఘ కాలంగా వెలగని స్ట్రీట్ లైట్లను ఎట్టకేలకు అధికారులు మరమ్మతులు చేయించారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చీకటి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, రాత్రి వేళల్లో ప్రయాణం క్లిష్టంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమస్యపై వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు, వెంటనే స్పందిించి మరమ్మతు పనులను చేపట్టారు. సంబంధిత విభాగానికి చెందిన సిబ్బంది, క్రేన్ మరియు అవసరమైన పరికరాలతో స్ట్రీట్ లైట్లను తనిఖీ చేసి, సాంకేతిక లోపాలను సరిదిద్దారు. చెడిపోయిన బల్బులను మార్చి, వైరింగ్ సమస్యలను పరిష్కరించారు.

ప్రస్తుతం బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు ఉన్న అన్ని స్ట్రీట్ లైట్లు పనిచేస్తున్నాయని, దీంతో రాత్రి వేళల్లో ఈ ప్రాంతం సురక్షితంగా మారిందని అధికారులు తెలిపారు. స్ట్రీట్ లైట్లు తిరిగి వెలగడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వేగవంతమైన చర్యలను వారు అభినందిస్తున్నారు.