ప్రచారాలకే పరిమితమైన "రాజీవ్ యువ వికాసం" పథకం?
రెండేళ్లు గడిచినా అమలు కాని వైనం.. తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన "రాజీవ్ యువ వికాసం" పథకం ప్రచారాలకే పరిమితమైందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పథకానికి దరఖాస్తులు స్వీకరించి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు అమలు ప్రక్రియ ముందుకు సాగడం లేదని మండిపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది యువతీ యువకులు ఈ పథకంపై ఆశలు పెట్టుకుని దరఖాస్తులు చేసుకున్నారని, అయితే ప్రభుత్వం ఆ దరఖాస్తులను మూలకు పడేసిందని విమర్శించారు. యువతను మభ్యపెట్టేందుకే దరఖాస్తుల స్వీకరణ పేరుతో హడావుడి చేశారని ఆరోపించారు.
పథకాన్ని అమలు చేసే ఉద్దేశం లేకపోతే దరఖాస్తులు ఎందుకు స్వీకరించారని యువత ప్రశ్నిస్తోందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.