BREAKING
పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.
www.ntodaynews.com

హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
27 Aug, 2026 - 05:02 PM
23 వీక్షణలు

హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన

  • సుబేదారి పోలీస్‌స్టేషన్ ఎదుట బీఆర్‌ఎస్ శ్రేణులు, పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన

హనుమకొండ | N Today News

జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరీశ్‌రావు చేపట్టిన కార్యక్రమం నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారంటూ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హనుమకొండలోని సుబేదారి పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసనకు దిగిన వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వచ్చిన హరీశ్‌రావును అరెస్ట్ చేయడం సరికాదని విద్యార్థులు, బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఏమిటంటూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన తీవ్రతరం కావడంతో పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారికి అండగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని, అవసరమైతే ఢిల్లీ వరకు రాస్తారోకో చేపడతామని హెచ్చరించినట్లు తెలిపారు.

జీవో 97ను రద్దు చేయడంతో పాటు పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని బీఆర్‌ఎస్ నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు.