www.ntodaynews.com
కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు
తెలంగాణ
/
మేడ్చల్-మల్కాజిగిరి
/
కీసర
కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు
రాఖీ పౌర్ణమి సందర్భంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డికి స్థానిక ఆర్పీలు రిసోర్స్ పర్సన్లు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్పీలు ఎస్ఐకి తిలకం దిద్ది, హారతి ఇచ్చి రాఖీలు కట్టారు. నిరంతరం ప్రజాసేవలో ఉండే అధికారులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలపడం ఎంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.
మహిళల ప్రేమ, అభిమానాలు తమపై బాధ్యతను మరింత పెంచాయని, మహిళల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్పీలు రామిడి రూప, ఎల్.పి. వసంత, టి. స్రవంతి, బి. లావణ్య ఎమ్. సుమలత, బి. లావణ్య తదితరులు పాల్గొన్నారు.