BREAKING
పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.
www.ntodaynews.com

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
Shaik Chand Basha Pulivendula Constituency Reporter
27 Aug, 2026 - 09:07 PM
10 వీక్షణలు

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

పులివెందుల అర్బన్:

పులివెందులలో పోలీసుల విస్తృత తనిఖీలునిబంధనలు

ఉల్లంఘించిన 19 మందికి జరిమారోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ద్విచక్ర వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పులివెందుల ట్రాఫిక్ సీఐ ప్రసాదరావు స్పష్టం చేశారు.జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలు,డీఎస్పీ బుక్కే మురళి సూచనల మేరకు గురువారం పులివెందుల పట్టణంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

పూల అంగళ్ళ సర్కిల్ వద్ద ట్రాఫిక్ సీఐ ప్రసాదరావు,నాలుగు రోడ్ల కూడలిలో టౌన్ ఎస్సై తిమోతి,పాత బస్టాండ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ ఎస్సై గంగాధరరెడ్డి వాహనాల తనిఖీలు చేపట్టారు.ముఖ్యంగా సాధారణ ప్రజలతో పాటు ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగులు హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ ప్రసాదరావు మాట్లాడుతూ దేశంలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోజుకు సగటున 28 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.సమీప ప్రాంతాలకే కదా అని నిర్లక్ష్యం చేయకుండా ఇంటి నుంచి బైక్‌పై బయటకు వచ్చే ప్రతిసారీ హెల్మెట్ పెట్టుకోవడాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని,ట్రిపుల్ రైడింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ప్రతి వాహనదారుడు సక్రమమైన ఆర్సీ,డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నారు.నిబంధనలు పాటించకుండా హెల్మెట్ లేకుండా ప్రయాణించిన 19 మంది వాహనదారులను గుర్తించి వారికి జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు.