చనుబండలో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం.. 25 మంది యువత దరఖాస్తులు సమర్పణ
నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ పంచాయతీ పరిధిలోని 6వ బూత్లో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము ఆధ్వర్యంలో 25 మంది కొత్త ఓటర్లు అవసరమైన అన్ని ధ్రువపత్రాలతో ఓటు నమోదు దరఖాస్తులను అందజేశారు.
ఈ సందర్భంగా నక్కా రాము మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువత దేశ సంపద అని అన్నారు. ఈ నెల 30వ తేదీలోపు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
యువ నాయకుడు నారా లోకేష్ ఆలోచనా విధానాలకు ఆకర్షితులై యువత ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారని తెలిపారు. విద్యా వ్యవస్థలో ఆయన చేపడుతున్న మార్పులు అభినందనీయమన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గంలో గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నాయకత్వంలో విజయం సాధించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కోరారు.