BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

ఉండవల్లి సెంటర్‌లో వరుస దొంగతనాలు.. వ్యాపారుల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 06:05 PM
1 వీక్షణలు

ఉండవల్లి సెంటర్‌లో వరుస దొంగతనాలు.. వ్యాపారుల్లో ఆందోళన

తాడేపల్లి పరిధిలో చెలరేగుతున్న దొంగలు.. నిఘా పెంచాలని స్థానికుల డిమాండ్

తాడేపల్లి, ఆగస్టు 28:

తాడేపల్లి పరిధిలో దొంగతనాలు వరుసగా చోటుచేసుకోవడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిఘా లోపం కారణంగానే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం రద్దీగా ఉండే ఉండవల్లి సెంటర్‌లో తాజాగా దొంగలు తమ చేతివాటం చూపించినట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో కూడా కొంత రద్దీ ఉండే ఈ ప్రాంతంలో ఐసీఐసీఐ బ్యాంకు ఎదురుగా ఉన్న స్టీల్‌ షాప్‌తో పాటు సమీపంలోని బేకరీలో దొంగతనం జరిగినట్లు తెలిసింది.

ఈ ఘటనలో సుమారు రూ.80 వేల విలువైన వస్తువులు, నగదు అపహరణకు గురైనట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో కూడా ఇదే ప్రాంతంలో రెండు పర్యాయాలు దొంగతనాలు జరిగినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

గత ఘటనలపై ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం లేకపోవడంతో పాటు, తాజాగా జరిగిన దొంగతనాలపై కూడా ఎలాంటి పరిష్కారం లభిస్తుందోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరిగి విసిగిపోయామని కొందరు వ్యాపారులు వాపోతున్నారు.

ఇకనైనా పోలీసు శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని, వ్యాపారులు, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.