పెనుగొలను మెట్టగుట్ట ఆలయంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
పెనుగొలను మెట్టగుట్ట ఆలయంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
గంపలగూడెం, ఆగస్టు 28:
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామ సరిహద్దులోని మెట్టగుట్టపై వెలసిన శ్రీ గజలక్ష్మి సమేత శేషాచల శ్రీనివాసస్వామి ఆలయంలో శుక్రవారం రాఖీ పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాటును ఆలయ అర్చకులు తూమాటి శ్యాంసుందర శ్రీనివాసాచార్యులు, తూమాటి యోగానందాచార్యులు పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ వేడుకల్లో ఆలయ చైర్మన్ పి. వెంకట్రావు, కమిటీ సభ్యులు ఆర్. వెంకటసుబ్బారావు, వి. కృష్ణారెడ్డి, పి. లక్ష్మణరావు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.