నెమలిలో వైభవంగా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి కల్యాణం
నెమలిలో వైభవంగా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి కల్యాణం
గంపలగూడెం:
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
ఆలయ అర్చకులు టీ. గోపాలచార్యులు వైఖానస పద్ధతిలో వేదమంత్రాల నడుమ కల్యాణ తంతును నిర్వహించారు. ముందుగా స్వామివారికి, అమ్మవారికి నూతన వస్త్రాలతో ప్రత్యేక అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించారు.
అనంతరం నిర్వహించిన కల్యాణ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కల్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. సంధ్య, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.