BREAKING
బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది
www.ntodaynews.com

తిరువూరులో శ్రీ వాసవి మాత అమ్మవారికి ఘనంగా సారె సమర్పణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 09:36 PM
1 వీక్షణలు

తిరువూరులో శ్రీ వాసవి మాత అమ్మవారికి ఘనంగా సారె సమర్పణ

శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు.. భక్తులతో కిటకిటలాడిన ఆలయం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలోని శ్రీ వాసవి మాత అమ్మవారి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య మహిళా సోదరీమణులు అమ్మవారికి సారె సమర్పించారు.

వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సారె సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

తెల్లవారుజాము నుంచే ఆలయానికి అధిక సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రావణ మాస పూజా కార్యక్రమాలతో ఆలయం భక్తి శోభను సంతరించుకుంది.