BREAKING
వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
Date of Publish : 29 August 2026, 11:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో బీజేపీ ఎస్‌ఐఆర్ బీఎల్‌ఏ-2 ఫారం సెవెన్ సమీక్ష సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 11:49 PM
11 వీక్షణలు

18 ఏళ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు కావాలి: పోలే శాంతి

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట:

విస్సన్నపేట మండలంలో ఎస్‌ఐఆర్ బీఎల్‌ఏ-2 ఫారం సెవెన్ సమీక్ష సమావేశం మండల అధ్యక్షుడు గంగిశెట్టి మధు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు పోలే శాంతి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పోలే శాంతి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. దేశ భవిష్యత్తులో యువత పాత్ర ఎంతో కీలకమని అన్నారు.

ఎస్‌ఐఆర్ బీఎల్‌ఏ-2 ఫారం సెవెన్ ప్రక్రియపై బీజేపీ నాయకులతో ఆమె చర్చించారు. ఓటర్ల నమోదు, బూత్ స్థాయి కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో విస్సన్నపేట మండల అధ్యక్షుడు గంగిశెట్టి మధు, తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అభినేని చంద్రశేఖర్ బాబు, మైనారిటీ జిల్లా ఉపాధ్యక్షుడు యశోద సుందర్ రావు, మండల సీనియర్ నాయకులు వెలగ రామారావు, మైనారిటీ ఉపాధ్యక్షుడు తాజుద్దీన్, బీఎల్వోలు, కార్యకర్తలు పాల్గొన్నారు.