విస్సన్నపేటలో బీజేపీ ఎస్ఐఆర్ బీఎల్ఏ-2 ఫారం సెవెన్ సమీక్ష సమావేశం
18 ఏళ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు కావాలి: పోలే శాంతి
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట:
విస్సన్నపేట మండలంలో ఎస్ఐఆర్ బీఎల్ఏ-2 ఫారం సెవెన్ సమీక్ష సమావేశం మండల అధ్యక్షుడు గంగిశెట్టి మధు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు పోలే శాంతి హాజరయ్యారు.
ఈ సందర్భంగా పోలే శాంతి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. దేశ భవిష్యత్తులో యువత పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
ఎస్ఐఆర్ బీఎల్ఏ-2 ఫారం సెవెన్ ప్రక్రియపై బీజేపీ నాయకులతో ఆమె చర్చించారు. ఓటర్ల నమోదు, బూత్ స్థాయి కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో విస్సన్నపేట మండల అధ్యక్షుడు గంగిశెట్టి మధు, తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అభినేని చంద్రశేఖర్ బాబు, మైనారిటీ జిల్లా ఉపాధ్యక్షుడు యశోద సుందర్ రావు, మండల సీనియర్ నాయకులు వెలగ రామారావు, మైనారిటీ ఉపాధ్యక్షుడు తాజుద్దీన్, బీఎల్వోలు, కార్యకర్తలు పాల్గొన్నారు.