BREAKING
వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
Date of Publish : 29 August 2026, 11:44 pm
Posted by : SHAIK CHAND BASHA

ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
29 Aug, 2026 - 11:44 PM
8 వీక్షణలు

ముద్దనూరు: గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ముద్దనూరులోని బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలుగు భాష గొప్పతనం, తెలుగు సాహిత్యానికి గిడుగు రామమూర్తి పంతులు చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. వ్యవహారిక భాష ఉద్యమానికి గిడుగు రామమూర్తి పంతులు చేసిన కృషిని ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు.

తెలుగు భాషను పరిరక్షించడంతో పాటు, భావితరాలకు తెలుగు భాషా సాహిత్య ప్రాధాన్యతను తెలియజేయాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యార్థులు తెలుగు భాషపై ఆసక్తి పెంచుకుని, నిత్య జీవితంలో తెలుగును విస్తృతంగా ఉపయోగించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొని తెలుగు భాషా దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.