BREAKING
వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
Date of Publish : 29 August 2026, 11:53 pm
Posted by : ADARI RAMA PRASAD

వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
ADARI RAMA PRASAD MUNAGAPAKA MANDAL
29 Aug, 2026 - 11:53 PM
10 వీక్షణలు

మునగపాక: వర్షాలు కురవక పొలాలకు సాగునీరు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో వర్షాలు పడకపోవడంతో పంట పొలాల్లో దుక్కులు, నాట్లు వంటి వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ మునగపాక గ్రామంలో రైతులు, గ్రామ ప్రజలు, రైతు సంఘాల ప్రతినిధులు కలిసి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలంతా కలిసి కప్పల పెళ్లిళ్లు నిర్వహించారు.

వర్షాలు కురిసి చెరువులు, కాలువలు, ఇతర నీటి వనరులు నిండాలని, రైతులకు సాగునీరు అందుబాటులోకి రావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. సకాలంలో వర్షాలు కురిస్తేనే వ్యవసాయ పనులు ఊపందుకుంటాయని రైతులు తెలిపారు.

ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటల సాగు కోసం వర్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. త్వరగా వర్షాలు కురిసి రైతులకు అనుకూల పరిస్థితులు ఏర్పడాలని గ్రామ ప్రజలు కోరుకున్నారు.

ఈ కార్యక్రమాన్ని రైతు సంఘం అధ్యక్షుడు ఆడారి మహేష్, కార్యదర్శి ఉల్లూరు నరసింహారావు, ఆడారి గోపి తదితరులు నిర్వహించారు. గ్రామ ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.