BREAKING
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం
www.ntodaynews.com

కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
Shaik Chand Basha Pulivendula Constituency Reporter
29 Aug, 2026 - 08:49 PM
2 వీక్షణలు

కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం

అభయాంజనేయ స్వామికి శ్రావణ శనివార ప్రత్యేక పూజలు

​పులివెందుల అర్బన్  

పులివెందుల పట్టణ పరిధిలోని కోతి సమాధి వద్ద గల అభయాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రావణ శనివారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్నదానం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ శ్రావణ శోభ సంతరించుకుంది.

తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు,విశేష ఆకుపూజలు శాస్త్రోక్తంగా జరిగాయి.అనంతరం స్వామివారిని విశేషంగా అలంకరించి,మహా మంగళహారతి సమర్పించారు.అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.పూజా కార్యక్రమాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు నిర్వహించిన హనుమాన్ భజనలు,సంకీర్తనలు భక్తిభావాన్ని నింపాయి. పూజానంతరం భక్తులందరికీ అన్నదాన వితరణ చేపట్టారు.​పవిత్రమైన శ్రావణ మాసంలో స్వామివారిని ఆరాధించడం,

అన్నదానం చేయడం వల్ల విశేష పుణ్యఫలాలు లభిస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు.ఈ కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన ఉభయదాతలకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు,స్థానిక ప్రముఖులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.