కొండపర్వలో ఘనంగా మాతృభాష దినోత్సవం..
కొండపర్వలో ఘనంగా మాతృభాష దినోత్సవం..
గిడుగు రామమూర్తి సేవలు చిరస్మరణీయం: బోట్ల శివ సత్యనారాయణ
ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వం:
కొండపర్వ గ్రామంలో మాతృభాష దినోత్సవం, గిడుగు రామమూర్తి జయంతి వేడుకలను ప్రముఖ సామాజిక కార్యకర్త బోట్ల శివ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రామమూర్తి చిత్రపటానికి నివాళులర్పించి, తెలుగు భాష గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు.
కార్యక్రమంలో బోట్ల శివ సత్యనారాయణ మాట్లాడుతూ గిడుగు రామమూర్తి తెలుగు భాష పరిరక్షణకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవహారిక భాష అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ మాతృభాష గొప్పతనాన్ని కాపాడుకోవాలని, తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలుగు భాషను సగర్వంగా నిలబెట్టుకోవడం ప్రతి తెలుగువాడి బాధ్యత అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పామర్తి లక్ష్మీనారాయణ, మూలుగుమటి శ్రీధర్, రామారావు, ఉమామహేశ్వరరావు, రాజు, రాధాకృష్ణ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.