కంభంపాడు మాలపల్లిలో ఎమ్మెల్యే రచ్చబండ..
కంభంపాడు మాలపల్లిలో ఎమ్మెల్యే రచ్చబండ.. ప్రజల సమస్యలపై తక్షణ స్పందన
ఎన్టీఆర్ జిల్లా | తిరువూరు నియోజకవర్గం | ఏ.కొండూరు
ఏ.కొండూరు మండలం కంభంపాడు గ్రామం మాలపల్లిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొని ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాలపల్లి ప్రజలు వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, రహదారులు, మౌలిక వసతుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు వివరించిన సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి తక్షణ పరిష్కారం సాధ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
దీర్ఘకాలికంగా పరిష్కరించాల్సిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, కూటమి ప్రభుత్వం సహకారంతో అవసరమైన నిధులు సమకూర్చి త్వరలోనే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజల వద్దకే వెళ్లి, సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయడమే రచ్చబండ కార్యక్రమాల లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.
నూతన తహసిల్దార్కు అభినందనలు
ఏ.కొండూరు మండల నూతన తహసిల్దార్గా బాధ్యతలు స్వీకరించిన వైకుంఠరావును ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా మండల ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని తహసిల్దార్కు సూచించారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.