BREAKING
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం
www.ntodaynews.com

తిరువూరులో జయహో బీసీ భారీ సభకు సన్నాహాలు....

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 08:54 PM
11 వీక్షణలు

తిరువూరులో “జయహో బీసీ” భారీ సభకు సన్నాహాలు.. మూడు రోజుల్లో ఘన నిర్వహణ

బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ.. సభ కార్యక్రమాల షెడ్యూల్ విడుదల

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం:

కూటమి ప్రభుత్వం ప్రకటించిన 34 శాతం బీసీ రిజర్వేషన్‌కు మద్దతుగా తిరువూరు నియోజకవర్గంలో నిర్వహించనున్న “జయహో బీసీ” భారీ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1వ తేదీ మంగళవారం నిర్వహించనున్నారు.

తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.

కార్యక్రమాల షెడ్యూల్:

➡️ మధ్యాహ్నం 2:30 గంటలకు

అయ్యప్ప స్వామి ఆలయం సమీపం నుంచి భారీ బైక్ ర్యాలీ ప్రారంభం.

➡️ మధ్యాహ్నం 2:45 గంటలకు

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల సమర్పణ.

➡️ మధ్యాహ్నం 3:00 గంటలకు

నందమూరి తారక రామారావు, డా. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల సమర్పణ.

➡️ మధ్యాహ్నం 3:15 గంటలకు

డా. బి.ఆర్. అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలకు పూలమాల సమర్పణ.

➡️ సాయంత్రం 3:45 గంటలకు

“జయహో బీసీ” భారీ సభ ప్రారంభం.

సభ వేదిక:

దారా పూర్ణయ్య టౌన్‌షిప్, శ్రీనిధి స్కూల్ పక్కన, తిరువూరు.

ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, బీసీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, బీసీ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

బైక్ ర్యాలీతో పాటు భారీ సభను ప్రజలకు చేరేలా ప్రచారం చేయాలని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కూడా ఆహ్వానం పలికారు.

“జయహో బీసీ” నినాదంతో బీసీల హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగుదామని నిర్వాహకులు పిలుపునిచ్చారు.