BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 29 August 2026, 08:54 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో జయహో బీసీ భారీ సభకు సన్నాహాలు....

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 08:54 PM
45 వీక్షణలు

తిరువూరులో “జయహో బీసీ” భారీ సభకు సన్నాహాలు.. మూడు రోజుల్లో ఘన నిర్వహణ

బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ.. సభ కార్యక్రమాల షెడ్యూల్ విడుదల

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం:

కూటమి ప్రభుత్వం ప్రకటించిన 34 శాతం బీసీ రిజర్వేషన్‌కు మద్దతుగా తిరువూరు నియోజకవర్గంలో నిర్వహించనున్న “జయహో బీసీ” భారీ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1వ తేదీ మంగళవారం నిర్వహించనున్నారు.

తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.

కార్యక్రమాల షెడ్యూల్:

➡️ మధ్యాహ్నం 2:30 గంటలకు

అయ్యప్ప స్వామి ఆలయం సమీపం నుంచి భారీ బైక్ ర్యాలీ ప్రారంభం.

➡️ మధ్యాహ్నం 2:45 గంటలకు

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల సమర్పణ.

➡️ మధ్యాహ్నం 3:00 గంటలకు

నందమూరి తారక రామారావు, డా. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల సమర్పణ.

➡️ మధ్యాహ్నం 3:15 గంటలకు

డా. బి.ఆర్. అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలకు పూలమాల సమర్పణ.

➡️ సాయంత్రం 3:45 గంటలకు

“జయహో బీసీ” భారీ సభ ప్రారంభం.

సభ వేదిక:

దారా పూర్ణయ్య టౌన్‌షిప్, శ్రీనిధి స్కూల్ పక్కన, తిరువూరు.

ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, బీసీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, బీసీ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

బైక్ ర్యాలీతో పాటు భారీ సభను ప్రజలకు చేరేలా ప్రచారం చేయాలని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కూడా ఆహ్వానం పలికారు.

“జయహో బీసీ” నినాదంతో బీసీల హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగుదామని నిర్వాహకులు పిలుపునిచ్చారు.