రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
పులివెందుల అర్బన్
రైతుల సాగునీటి అవసరాలను తీర్చి పంటలను కాపాడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తుంగభద్ర ప్రాజెక్ట్ హైలెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి స్పష్టం చేశారు.శనివారం పులివెందుల టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మారెడ్డి జోగిరెడ్డి మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి సీబీఆర్ రైట్ కెనాల్కు నీటిని విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు.ఆయకట్టు పరిధిలోని పంటలకు సాగునీటి కొరత రాకుండా రాబోయే పది రోజుల పాటు నిరంతరాయంగా నీటి సరఫరా కొనసాగుతుందని అందుబాటులో ఉన్న ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుంటూ చివరి ఆయకట్టు వరకు సమర్థవంతంగా సాగునీరు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారు అని అన్నారు.
సాగునీటి సరఫరాలో రైతులకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులతో నిరంతరం
పర్యవేక్షణ చేపడుతున్నారు.
రైతుల సంక్షేమం,సాగునీటి భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని,రైతన్నలకు అన్ని విధాలా భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మారెడ్డి జోగిరెడ్డి పేర్కొన్నారు.