www.ntodaynews.com
పోలవరంలో ఆర్సీఎం చర్చి నిర్మాణ పనులు ముమ్మరం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
పోలవరంలో ఆర్సీఎం చర్చి నిర్మాణ పనులు ముమ్మరం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలోని పడమర దళితవాడలో ఆర్సీఎం చర్చి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
గ్రామంలో ఆధ్యాత్మిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ చర్చి నిర్మాణానికి కీర్తిశేషులు చల్లారి సత్యం అలియాస్ పానుగంటి సత్యనారాయణ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ఆయన కుమారులు మహేష్ గౌడ్, సూరిబాబు గౌడ్ సారథ్యంలో నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.
చర్చి నిర్మాణం పూర్తయితే గ్రామంలోని క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహించేందుకు మరింత సౌకర్యవంతమైన వసతి అందుబాటులోకి రానుంది. నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు.