BREAKING
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం
www.ntodaynews.com

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో బీజేపీ సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
29 Aug, 2026 - 08:57 PM
6 వీక్షణలు

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో బీజేపీ సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక

మంచిర్యాల | N Today News

మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీకి చెందిన సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

లక్షెట్టిపేట్ మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన బీజేపీ సర్పంచ్ సురమల్ల సౌజన్య–రాజయ్య శనివారం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లక్ష్మిపూర్ గ్రామ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు.

నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరడం ద్వారా గ్రామస్థాయిలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు తెలిపారు. లక్ష్మిపూర్ గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.