BREAKING
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం
www.ntodaynews.com

హైదరాబాద్‌లో రాత్రంతా ఆర్టీసీ బస్సులు..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 08:53 PM
18 వీక్షణలు

హైదరాబాద్‌లో రాత్రంతా ఆర్టీసీ బస్సులు.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త సేవలు

హైదరాబాద్‌: నగర ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త అందించింది. సెప్టెంబర్ 1 నుంచి హైదరాబాద్‌లో రాత్రి సమయాల్లోనూ ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా ఆరు ప్రధాన మార్గాల్లో ఈ సేవలను ప్రారంభించనున్నారు.

పైలట్ ప్రాజెక్టులో భాగంగా సికింద్రాబాద్‌–కొండాపూర్, బాచుపల్లి–వేవ్‌రాక్, సికింద్రాబాద్‌–హయత్‌నగర్, కోఠి–పటాన్‌చెరు, కోఠి–హైటెక్‌సిటీ, సికింద్రాబాద్‌–పటాన్‌చెరు మార్గాల్లో రాత్రి వేళల్లో బస్సులు నడవనున్నాయి.

రాత్రి పూట ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల స్పందన ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని మార్గాలకు రాత్రి సర్వీసులను విస్తరించే అవకాశం ఉంది.