హైదరాబాద్లో రాత్రంతా ఆర్టీసీ బస్సులు..
హైదరాబాద్లో రాత్రంతా ఆర్టీసీ బస్సులు.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త సేవలు
హైదరాబాద్: నగర ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త అందించింది. సెప్టెంబర్ 1 నుంచి హైదరాబాద్లో రాత్రి సమయాల్లోనూ ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా ఆరు ప్రధాన మార్గాల్లో ఈ సేవలను ప్రారంభించనున్నారు.
పైలట్ ప్రాజెక్టులో భాగంగా సికింద్రాబాద్–కొండాపూర్, బాచుపల్లి–వేవ్రాక్, సికింద్రాబాద్–హయత్నగర్, కోఠి–పటాన్చెరు, కోఠి–హైటెక్సిటీ, సికింద్రాబాద్–పటాన్చెరు మార్గాల్లో రాత్రి వేళల్లో బస్సులు నడవనున్నాయి.
రాత్రి పూట ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల స్పందన ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని మార్గాలకు రాత్రి సర్వీసులను విస్తరించే అవకాశం ఉంది.