చిట్యాలలో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణాష్టమి.
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
చిట్యాలలో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణాష్టమి.. 6న ఊరందరి బోనాలు
నల్గొండ జిల్లా చిట్యాల పురపాలక సంఘం పరిధిలో శ్రీకృష్ణాష్టమి (ఉట్ల పండగ), గ్రామ దేవతలకు ఊరందరి బోనాల నిర్వహణకు సంబంధించి శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పురపాలక సంఘం చైర్పర్సన్ ఆధ్వర్యంలో, దౌలతాబాద్ వాసు పంతులు సమన్వయంతో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం శ్రీకృష్ణాష్టమి (ఉట్ల పండగ), సెప్టెంబర్ 6వ తేదీ ఆదివారం గ్రామ దేవతలకు ఊరందరి బోనాలు సమర్పించాలని నిర్ణయించారు. పట్టణ ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో పండుగలను నిర్వహించాలని పురపాలక సంఘం చైర్పర్సన్ కోరారు. ఈ సమావేశంలో అఖిలపక్ష సభ్యులు, పురపాలక సంఘ కౌన్సిల్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.