BREAKING
వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
Date of Publish : 29 August 2026, 11:49 pm
Posted by : ఈడూరి డేవిడ్

నల్లమలసాగర్‌కు నీటి విడుదలపై కోఆర్డినేషన్ కమిటీ సమావేశం

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
29 Aug, 2026 - 11:49 PM
7 వీక్షణలు

మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు నుంచి నల్లమలసాగర్ రిజర్వాయర్‌కు ఈ నెల 31న నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లు, సమన్వయంపై మార్కాపురం మార్కెట్ యార్డులో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నల్లమలసాగర్ రిజర్వాయర్‌కు నీటి విడుదల కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణ, అధికారుల సమన్వయం, ఇతర ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు.

ఈ సమావేశంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, అశోక్ రెడ్డి, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు గురుమూర్తి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్ బాబు, గోపాలపురం ఎమ్మెల్యే, ఒంగోలు–నెల్లూరు జిల్లాల జోనల్ కోఆర్డినేటర్ మద్దిపాటి వెంకట రాజు తదితరులు పాల్గొన్నారు.

నల్లమలసాగర్‌కు నీటి విడుదల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించారు.

వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమలసాగర్ రిజర్వాయర్‌కు నీరు చేరడంతో సాగునీటి అవసరాలకు ప్రయోజనం చేకూరుతుందని, రైతులకు మేలు జరుగుతుందని నాయకులు పేర్కొన్నారు.