నల్లమలసాగర్కు నీటి విడుదలపై కోఆర్డినేషన్ కమిటీ సమావేశం
మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు నుంచి నల్లమలసాగర్ రిజర్వాయర్కు ఈ నెల 31న నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లు, సమన్వయంపై మార్కాపురం మార్కెట్ యార్డులో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నల్లమలసాగర్ రిజర్వాయర్కు నీటి విడుదల కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణ, అధికారుల సమన్వయం, ఇతర ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, అశోక్ రెడ్డి, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు గురుమూర్తి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జి ఎరిక్షన్ బాబు, గోపాలపురం ఎమ్మెల్యే, ఒంగోలు–నెల్లూరు జిల్లాల జోనల్ కోఆర్డినేటర్ మద్దిపాటి వెంకట రాజు తదితరులు పాల్గొన్నారు.
నల్లమలసాగర్కు నీటి విడుదల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించారు.
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమలసాగర్ రిజర్వాయర్కు నీరు చేరడంతో సాగునీటి అవసరాలకు ప్రయోజనం చేకూరుతుందని, రైతులకు మేలు జరుగుతుందని నాయకులు పేర్కొన్నారు.