BREAKING
వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
Date of Publish : 29 August 2026, 11:46 pm
Posted by : BALAKRISHNA BANDI

బాల కార్మికుల బాల కార్మికుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలితోడ్పాటు

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
29 Aug, 2026 - 11:46 PM
8 వీక్షణలు

చిత్తూరు జిల్లా, రొంపిచర్ల: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రేట్ విజన్ సొసైటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. రొంపిచర్ల మండల కేంద్రంలో గ్రేట్ విజన్ సొసైటీ ఆధ్వర్యంలో బాల కార్మికుల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

రొంపిచర్ల మండలంలోని వర్క్‌షాప్‌లు, వివిధ వ్యాపార సంస్థలు, ఇతర పని ప్రదేశాల్లో బాల కార్మికులు పనిచేయకుండా చూడాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టారు. బాలలతో పనులు చేయించడం చట్టరీత్యా నేరమని, బాలలకు పనికంటే విద్యే ముఖ్యమని నిర్వాహకులు తెలిపారు.

ప్రతి బాలుడు బడికి వెళ్లి విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు, వ్యాపార యజమానులు, ప్రజలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. బాలలను పనుల్లోకి పంపకుండా వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

బాల కార్మికులను పనుల్లో నియమించుకునే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రేట్ విజన్ సొసైటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

గ్రేట్ విజన్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ జి.వి. సుబ్రహ్మణ బాబు ఆధ్వర్యంలో రొంపిచర్లతో పాటు పులిచెర్ల మండలంలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ బాల కార్మికుల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రొంపిచర్ల మండల సబ్‌ఇన్‌స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, గ్రేట్ విజన్ సొసైటీ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. బాల కార్మికులను గుర్తించినప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించి, వారిని తిరిగి పాఠశాలలకు పంపించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్వాహకులు కోరారు.