BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 31 August 2026, 05:56 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
31 Aug, 2026 - 05:56 AM
21 వీక్షణలు

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య

ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య.. ముగ్గురు అరెస్ట్

అన్నమయ్య జిల్లా | రామాపురం | Ntoday News

అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతో ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో కలకలం రేపింది. గండ్లపల్లికి చెందిన బాలకృష్ణ హత్య కేసులో భార్య రావి చిన్నక్క, ఆమె ప్రియుడు రఫీ, అతని స్నేహితుడు నవీన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 9న బాలకృష్ణ మద్యం సేవించే సమయంలో అందులో విషపు గుళికలు కలిపినట్లు పోలీసులు తెలిపారు. అయితే విషపు గుళికలు కలిపిన మద్యం తాగినప్పటికీ బాలకృష్ణ మృతి చెందకపోవడంతో, నిందితురాలు తన ప్రియుడు రఫీ, అతని స్నేహితుడు నవీన్‌తో కలిసి అతడిపై దాడి చేసినట్లు పేర్కొన్నారు.

అనంతరం బాలకృష్ణ మెడకు విద్యుత్ వైరు బిగించి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. హత్య అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి గాలివీడు మండలం బోరెడ్డిగారిపల్లి పరిధిలోని వ్యవసాయ బావిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.

సీసీ కెమెరాల ఆధారంగా కేసు ఛేదింపు

బాలకృష్ణ అదృశ్యం, హత్యకు సంబంధించిన దర్యాప్తులో పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుల కదలికలను గుర్తించిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్యకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.

నిందితుల నుంచి 70 అడుగుల విద్యుత్ వైరు, ఒక స్కూటీ, ఒక హెల్మెట్, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ కృష్ణమోహన్ వెల్లడించారు. కేసు దర్యాప్తులో సీఐ, గాలివీడు ఎస్‌ఐ నరసింహారెడ్డితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.