సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
సింహాద్రిపురం | Ntoday News
సింహాద్రిపురం మండల పరిధిలోని అంకాలమ్మగూడూరు సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పులివెందుల (బలపనూరు) వైపు నుంచి అంకాలమ్మగూడూరు వైపు వెళ్తున్న ఓ ఆటో వెనుక బైక్పై ఓ వ్యక్తి వేగంగా వస్తున్నాడు. రహదారిపై గుంతలు అధికంగా ఉండటంతో ఆటో డ్రైవర్ వాహనాన్ని నెమ్మదించి ఎడమ వైపునకు తిప్పాడు.
ఆ సమయంలో బైక్ చోదకుడు ఆటోను ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న గుంత, ఆటోను గమనించడంతో ఆందోళనకు గురై అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో బైక్ అదుపుతప్పి స్కిడ్ అయి రహదారి పక్కన ఉన్న రాళ్లపై పడిపోయింది.
ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రహదారిపై గుంతల కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొంటూ, అధికారులు స్పందించి గుంతలను పూడ్చి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.