BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 30 August 2026, 09:03 pm
Posted by : BALAKRISHNA BANDI

చల్లా బాబు రెడ్డికి టీడీపీ శ్రేణుల సంఘీభావం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
30 Aug, 2026 - 09:03 PM
45 వీక్షణలు

చల్లా బాబు రెడ్డికి టీడీపీ శ్రేణుల సంఘీభావం

స్వగృహానికి తరలివచ్చిన వేలాది మంది కార్యకర్తలు

చిత్తూరు జిల్లా | రొంపిచర్ల | N Today News

చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలంలో మాజీ ఇన్‌చార్జ్ చల్లా బాబు రెడ్డి స్వగృహానికి పుంగనూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం తెలిపారు. వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు తండోపతండాలుగా తరలిరావడంతో పరిసర ప్రాంతం టీడీపీ శ్రేణులతో సందడిగా మారింది.

ఈ సందర్భంగా చల్లా బాబు రెడ్డి మాట్లాడుతూ.. తాను గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నానని, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పట్ల ఎప్పటికీ కట్టుబడి ఉంటానని అన్నారు. పదవి ఉన్నా లేకపోయినా కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు.

తన రాజకీయ ప్రయాణంలో పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, పార్టీ ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ పనిచేశానని పేర్కొన్నారు. కార్యకర్తల కోసం వారితో కలిసి జైలుకు వెళ్లిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తనతో పాటు కష్టకాలంలో నిలిచిన కార్యకర్తలను ఎప్పటికీ మరచిపోనని అన్నారు.

నియోజకవర్గంలో కొంతమంది కొత్త రాజకీయ విధానాలతో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని చల్లా బాబు రెడ్డి విమర్శించారు. అయితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీకి, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని తెలిపారు.

తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పార్టీకి ఎప్పుడూ ద్రోహం చేయలేదని, పార్టీ సిద్ధాంతాలకు, నాయకత్వానికి కట్టుబడి పనిచేశానని పేర్కొన్నారు. కార్యకర్తలే తన రాజకీయ బలమని చెబుతూ, వారి కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు.

కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో చల్లా బాబు రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ప్రసంగం చివర్లో కన్నీటి పర్యంతం కావడంతో అక్కడున్న కార్యకర్తలు భావోద్వేగానికి లోనయ్యారు.

చల్లా బాబు రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయనకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాను ముందుండి అండగా నిలుస్తానని చల్లా బాబు రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. భారీగా తరలివచ్చి సంఘీభావం తెలిపిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.