అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
కోనసీమ జిల్లా | రావులపాలెం | Ntoday News
రావులపాలెం పట్టణంలోని మారుతి నగర్లో శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, భక్తులు చిర్ల జగ్గిరెడ్డిని కలిసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణం త్వరితగతిన పూర్తై భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.
స్థానిక భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.