BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 30 August 2026, 09:04 pm
Posted by : కూనురు మధు

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

తెలంగాణ
/ నల్గొండ / నల్గొండ
30 Aug, 2026 - 09:04 PM
35 వీక్షణలు

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజేయు–ఐజేయు) నిరంతరం కృషి చేస్తుందని ఆ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి అన్నారు.

కనగల్‌లో ఆదివారం నిర్వహించిన టీయూడబ్ల్యూజేయు మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయించేందుకు సంఘం తరఫున పోరాడుతామని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం కనగల్ మండల ప్రెస్ క్లబ్ (టీయూడబ్ల్యూజేయు) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సుంకిరెడ్డి జాగాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మల్లెపల్లి నరసింహ, ఉపాధ్యక్షులుగా దాసిరెడ్డి నవీన్ రెడ్డి, మహేశ్వరం రమేష్ కుమార్, కోశాధికారిగా రాయల సునీల్ కుమార్, కార్యదర్శిగా పాలకూరి లింగస్వామి, సహాయ కార్యదర్శిగా తొరకొప్పుల నాగయ్య ఎన్నికయ్యారు.

కమిటీ సభ్యులుగా చీదేటి వంశీధర్ రెడ్డి, మాచర్ల లక్ష్మీనారాయణ తదితరులు ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులను జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి శాలువాలతో సత్కరించి అభినందించారు.

కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి దోటి శ్రీనివాస్, అక్షర కలం ఎడిటర్ పిట్టల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.