మంత్రి పదవి ఆశ లేదు.. మరోసారి పీసీసీ అధ్యక్షుడిగానే
తెలంగాణ
/
హైదరాబాద్
మంత్రి పదవి ఆశ లేదు.. మరోసారి పీసీసీ అధ్యక్షుడిగానే కొనసాగాలని ఉంది: మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణ: రాబోయే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయడమే తమ లక్ష్యమని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. తనకు మంత్రి పదవి కావాలనే కోరిక లేదని, మరోసారి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
పార్టీలోని అంతర్గత అంశాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేశారు. ఆరు హామీల్లో ఎక్కువ భాగం అమలు చేస్తున్నామని తెలిపారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.