చిట్యాల నిత్య యోగ సాధకుల నూతన కార్యవర్గం ఎన్నిక
చిట్యాల నిత్య యోగ సాధకుల నూతన కార్యవర్గం ఎన్నిక
: శ్రీ దత్త ఫౌండేషన్ ఆధ్వర్యంలోని సంకల్ప క్రియా యోగ నిత్య సాధకుల నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యోగ గురువు రఘు గురూజీ జన్మదినం సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
గౌరవ అధ్యక్షుడిగా బూరుగు కృష్ణయ్య, గౌరవ సలహాదారులుగా కాచం కృష్ణయ్య, కంచర్ల ఈశ్వరయ్య, నారబోయిన శ్రీనివాస్, పాటి మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు.
అధ్యక్షుడిగా మాస శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా పొన్నం లక్ష్మయ్య, గాదె ఎల్లేష్, ప్రధాన కార్యదర్శిగా కమ్మంపాటి నరసింహ, సహాయ కార్యదర్శులుగా దాడి అరుణ, కోనేటి సాయిరామ్ ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా చొల్లేటి రవీంద్రనాథ్, మందడి లక్ష్మి, పాలాది రమేష్, కుక్కడపు లక్ష్మి, పందిరి అర్చన తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.